భోలక్పూర్ నల్ల పోచమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకురాలు స్వరూప వివరాలు తెలిపారు. దేవాలయం హుండీలోని నగదుతో పాటు, సమీపంలోని తన ఇంట్లోని నగలు మాయమైనట్లు స్వరూప పేర్కొన్నారు. గత కొద్ది కాలంగా గుడి మూసి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
భార్య ఆ పని చేస్తోందని తెలిసి భర్త బలవన్మరణంశ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన భార్య పలువురితో వివాహేతర సంబంధం పెట్టుకొని వాళ్ల ద్వారా తనను వేధింపులకు గురి చేస్తోందని సాఫ్ట్వేర్ ఉద్యోగి పొట్నూరు క్రాంతి కిరణ్ (39) ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు సెల్పీ వీడియో ద్వారా తన ఆవేదనను చెప్పుకొచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్-2 మూవీలో జగపతిబాబు?టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో ‘వార్-2’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నెట్టింట ఓ వార్త వైరలవుతోంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. తారక్కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది.
Apr 01, 2024, పార్లమెంట్ ఇన్ఛార్జ్లను నియమించిన టీ కాంగ్రెస్టీ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్లను నియమించింది. ఖమ్మం పొంగులేటి, నల్లగొండ ఉత్తమ్, కరీంనగర్ పొన్నం, పెద్దపల్లి శ్రీధర్ బాబు, వరంగల్ ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల, హైదరాబాద్ ఓబెదుల్లా, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, చేవెళ్ల వేంనరేందర్రెడ్డి, మల్కాజిగిరి మైనంపల్లి, మెదక్ కొండా సురేఖ, నిజామాబాద్ సుదర్శన్రెడ్డి, ఆదిలాబాద్ సీతక్కలను నియమించారు.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డీయర్నెస్ రిలీఫ్ ను 4 నుంచి పెంచారు. పెంచిన రిలీఫ్ 2024 జనవరి 1 నుంచి లెక్కిస్తారు. మార్చి 19న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) పెరిగిన డీఆర్ ను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, దానికి పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులకు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారికి కుటుంబ సభ్యులందరికీ దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. […]
దిల్లీ: రాముడు సత్యం, ధర్మం కోసం పోరాడినప్పుడు అతడి చేతిలో అధికారం లేదని, రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రథమైనా లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ అన్నారు. రామ భక్తులుగా చెప్పుకొనే నేటి అధికార పార్టీ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తించేందుకు ఆయన జీవితమే ఉదాహరణ అని చెప్పారు. దిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్’ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రామాయణ ఇతిహాసంలోని […]
ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నేను మంగళగిరికి ఒక ఐటి పరిశ్రమను రప్పించి 150మందికి ఉపాధి కల్పించాను సొంత నిధులతో ప్రభుత్వానికి సమాంతరంగా 29 సంక్షేమ పథకాలు అమలు చేశాను పదేళ్లు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆర్కే అలియాస్ కరకట్ట కమలహాసన్ చేసిందేమిటి? పనిచేస్తున్నదెవరో, పూటకో వేషం కడుతూ నాటకాలాడుతున్నది ఎవరో విజ్ఞులైన మంగళగిరి ప్రజలు గుర్తించాలి.
హైదరాబాద్ :-భారత స్టార్ వెయిట్లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను గతేడాది ఆసియా క్రీడల్లో తుంటి గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత ఆమె రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె థాయిలాండ్లో ఆది వారం ప్రారంభమైన ఇంటర్నే షనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడ రేషన్ వరల్డ్ కప్ బరిలో నిలిచింది. సోమవారం మహిళల 49 కేజీల కేట గిరీలో మీరాబాయిచాను పోటీపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్స్ […]
ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి చంద్రబాబు అడ్డు తగిలారన్నారు. సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల సేవలను నిలుపుదల చేశారన్నారు. దీనిని కేవలం ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలోనే స్థాపించారన్నారు. ఇందులో ఉన్నది […]
Received overcame oh sensible so at an. Formed do change merely.
© 2023 Created with Royal Elementor Addons